తాండూరులో ఫేక్ కరెన్సీ కలకలం..!
– అసలు నోట్లకు మించి 500నోట్ల తయారి
– హైదరాబాద్లో పట్టుబడిన ముఠాతో గుట్టు రట్టు
– షాకింగ్ నిజాలను వెల్లడించిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో ఫేక్ కరెన్సీ 500నోట్ల తయారి కలకలం రేపుతోంది. హైదరాబాద్లో ఓ ముఠాను పోలీసులు అదులోకి తీసుకోవడంతో గుట్టు రట్టు అయ్యింది. ముఠా వెనుక ఉన్న సూత్రదారి.. నకిలీ నోట్లు ఎలా తయారు చేస్తారు. వాటిని ఎలా చెలామణి చేస్తారు.. అనే షాకింగ్ నిజాలను పోలీసులు వెల్లడించారు.

కోస్గి మండలం గుండిమల్ గ్రామానికి చెందిన కస్తూరీ రమేష్ బాబు, అతని సోదరి రామేశ్వరిలపై గతంలో నకిలీ నోట్ల విషయంలో పలు పోలీస్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. కొన్ని నెలలుగా రమేష్ బాబు, రామేశ్వరిలు తాండూరు పట్టణం కోకట్ రోడ్డు మార్గంలో ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. గతంలోనే నకిలీ నోట్ల తయారిలో నైపుణ్యం ఉన్న రమేష్ బాబు 500 నోట్లను అసలు మించి ఉండేలా నకిలీ నోట్లను తయారు చేశాడు. వాటిని చలామణి చేసేందుకు ఇన్స్ట్రాగ్రాం ద్వారా పోస్టు పెట్టారు. ఇది చూసిన అబ్దుల్ వహీద్, తహాన్ చూసి రమేష్ను సంప్రదించారు. వారు ఓ ముఠాగా ఏర్పడి నోట్ల చలామణికి పాల్పడుతున్నారు.

ఈ మేరకు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు బృందాన్ని పట్టుకున్నారు. పోలీసులు దాడులు నిర్వహించి మొత్తం 950 నోట్లను స్వాదీనం చేసుకున్నారు. 950 నకిలీ నోట్లతో రూ. 4లక్షల 75వేలను తయారు చేశారని తెలిపారు. ఈ మేరకు గుట్టు రట్టు కావడంతో రమేష్ బాబు, 8 మంది ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండుకు తరలించడం జరిగిందని పోలీసులు తెలిపారు.
నకిలీ నోట్లు ఎలా తయారు చేశారంటే..
ఈ కేసులో నిందితుడైన కస్తూరి రమేష్ బాబు ముందుగా 500 నోటును స్కాన్ చేసి ప్రింట్ తీస్తారు. జేకే బాండ్ పేపర్తో సమానంగా కట్ చేసి.. ఆ వెంటనే ఓ గ్రీన్ ట్యాగ్ను పేవికాల్తో అతికించి అసలుకు మించిన నకిలీ నోటును తయారు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ముందుగా రమేష్ బాబు నుంచి వాహిద్, అతని స్నేహితలు ఒక అసలు నోటుకు నాలుగు నకిలీ తీసుకుని, తరువాత వారు సోహైల్, ఫాహెద్ అలీలకు ఒక అసలు నోటుకు మూడు నకిలీ నోట్లు, అ తరువాత వారిద్దరు ఇమ్రాన్, ఓమర్లు ఒక అసలు నోటుకు రెండు నకిలీ నోట్లు అందిస్తూ చలామణిని ప్రారంభించారు. ఈ మేరకు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు బృందాన్ని పట్టుకున్నారు.

తాండూరు నుంచి జంప్
నోట్ల తయారిలో నిందితడుగా ఉన్న రమేష్ బాబు, అతని సోదరి రామేశ్వరిలో నాలుగు రోజుల క్రితమే తాండూరు నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాండూరులో ఉంటున్న వారి నివాసంకు తాళం వేసి కనిపించింది. తాండూరులో నకిలీ నోట్ల తయారి జరుగుతుందని బయటకు రావడంతో స్థానికంగా ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.

ఇదికూడా చదవండి…

