హిందూ సమ్మేళనంలో పాల్గొందాం రండి..!
– నేడు తాండూరులో ఉత్సవానికి ఏర్పాట్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆత్మీయ హిందూ బందువుల కోసం ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనంలో పాల్గొందాం రండి అంటూ ఉత్సవ నిర్వహకులు పిలుపునిచ్చారు.

నేడు శనివారం తాండూరు పట్టణం అయ్యప్ప నగర్లో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణంలోని అయ్యప్ప నగర్ దేవాలయం వద్ద సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తన్న సమ్మేళనంకు కేసరవల్లి శ్రీ భువనేశ్వర పీఠాధిపతి కమలానంద భారతి స్వామి, ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యాకారిణి అన్నదానం సుబ్రమణ్యం పాల్గొననున్నారని తెలిపారు.

హిందు సమ్మేళనంలో పాల్గొనేందుకు తాండూరుతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, యువకులు, ఆర్ఎస్ఎస్ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.


