ఎసీడీటీకీ చెక్‌..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

chai jrఎసీడీటీకీ చెక్‌..!
– వీటిని తీసుకుంటే బాధ దూరం
– పండ్లు, కూరగాయాలు ఎలా పనిచేస్తాయంటే..?
దర్శిని డెస్క్ : రోజువారీ జీవితంలో మన ఆహారం, ఆహారపు అలవాట్లు, ఆరోగ్య అలవాట్లలో మార్పులు మన శరీరానికి ఎన్నో అనారోగ్య సమస్యలను తెచ్చిపెడాయి. అందులో వేధించే సమస్య ఎసీడీటీ. ఈ సమస్యను ఎదుర్కోనే వారు దాని పరిష్కారం కోసం కొంచెం శ్రద్ధ చూపాలి. మీకు ఎసిడిటి ఉంటే, అది అజీర్ణం మరియు మలబద్ధకం వంటి సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల, అటువంటి పరిస్థితులకు పరిష్కారం కోసం మనము జాగ్రత్తలు తీసుకోవాలి. బయట ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తిన్న తర్వాత ఇది కొంత మందిలో కనిపిస్తుంది. అయితే, అటువంటి సందర్భాలలో, ఉబ్బరం సమస్యను నిరోధించడానికి సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

ఆకుపచ్చ కూరగాయలు
గ్రీన్ బీన్స్, బ్రోకలీ, ఆస్పరాగస్, క్యాలీఫ్లవర్, ఆకుకూరలు, బంగాళదుంపలు, దోసకాయలలో కొవ్వు, చక్కెర తక్కువగా ఉంటాయి. వీటిని వారంలో మూడు సార్లు తీసుకోవడంలో జీర్ణక్రియ పని తీరును మెరుగుపరుస్తుంది.

పెరుగు
పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఇది కడుపు సమస్యలను నివారిస్తుంది. ఇవి ఎసిడిటీని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

అల్లం
అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యానికి చికిత్స చేయడంలో సహాయపడతాయి. అల్లం టీని తాగడం వల్ల గుండెల్లో మంట లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు.

పండ్లు
అరటిపండ్లు, పుచ్చకాయ వంటి పండ్లు ఇతర పండ్ల కంటే తక్కువ ఆమ్లతను కలిగి ఉంటాయి. అందువల్ల, ఎసిడిటీ సమస్య పెరిగినప్పుడు, వీటిని తీసుకోవడం వల్ల వేగంగా జీర్ణం కావడమే కాకుండా, కడుపు ఉబ్బరం కూడా ఉండదు.

లవంగాలు
భోజనం చేసిన గంట తర్వాత లవంగం టి తీసుకోవడం వల్ల ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజు లవంగం టీ తాగితే జీర్ణక్రియ సమస్యలు దరిచేరవు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

ఇదికూడ చదవండి…

మీ కరెంటు బిల్లు తెసుకోవడం ఈజీ