కట్ట మైసమ్మ దేవాలయం నూతన కమిటి ఎన్నిక
– గౌవారధ్యక్షులుగా ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్
– ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఆదర్శనగర్ లోని శ్రీ కట్ట మైసమ్మ దేవాలయం నూతన కమిటి ఏర్పాటయ్యింది. ఆదివారం కొత్త కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ కమిటి గౌరవాధ్యక్షులుగా తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్, అధ్యక్షులుగా బీ. రమేష్, ఉపాధ్యక్షులుగా నవీన్ కంఠం, ప్రధాన కార్యదర్శిగా కె. వేణుగోపాల్, ఉప కార్యదర్శిగా కె.నర్సింలు, కోశాధికారిగా ఈ.అంజిలయ్య, టీ.రాములు, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా జే.సుధాకర్, ఎస్. సుధాకర్, పట్నం రమేష్, రాజేష్, కె. కృష్ణ, నాగప్ప, వెంకటప్ప, బెజ్జు రమేష్, పాపయ్య, ఆనంద్ సేట్, యాదగిరి రెడ్డిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి…

