మృతునికి కుటుంబానికి బుయ్యని భరోసా
– అనుచరులతో ఆర్థిక సాయం అందజేత
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలోని ఓ మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి భరోసా అందించారు. మండలంలోని కొత్లాపూర్ గ్రామానికి చెందిన మ్యాతరి చంద్రప్ప మరణించారు.

శనివారం ఈ విషయం తెలుసుకున్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. కుటుంబ సభ్యులకు తన అనుచరుల ద్వారా ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి అందించిన సాయాన్ని గ్రామ మాజీ సర్పంచ్ బుడ్డెళ్లి సాయిలు ద్వారా అందజేశారు. ఈ సందర్బంగా కుటుంభీకులు శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

