నేను చనిపోయేది అమ్మనాన్నలకు చెప్పొద్దు
– కన్నీళ్లు పెట్టించిన ఆరేళ్ల చిన్నారి మనోధైర్యం
– క్యాన్సర్తో కన్నుమూసిన బాలుడు
– సోషల్ మీడియాలో వైద్యుడి పోస్టు వైరల్
హైదరాబాద్, దర్శని ప్రతినిధి: ఆడిపాడుకునే వయసులో క్యాన్సర్ అంటే అర్థమే చిన్నారులకు తెలియదు. ఆరేళ్ల వయసులోనే ఆ చిన్నారి మనోధైర్యాన్ని ప్రదర్శించాడు. తనకేదో అవుతుందని భయపడకుండా తల్లిదండ్రుల గురించి ఆలోచించాడు. డాక్టర్ నాకు మెదడు క్యాన్సర్ ఉంది. మరి కొద్ది రోజుల కంటే ఎక్కువ కాలం బతకను. కానీ ఈ విషయాన్ని అమ్మానాన్నలకు చెప్పొద్దు..తెలిస్తే వారు తట్టుకోలేరంటూ ఆరేళ్ల బాలుడు వైద్యుడితో చెప్పాడు. చావు అంటేనే సరిగ్గా అర్థం తెలియని వయసులో ఆరేళ్ల చిన్నారి తన తల్లితండ్రుల సంతోషం గురించి ఆలోచించాడు.చివరకు లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. హైదరాబాద్ చిన్నారి ఉదంతం ఇప్పుడు వైరల్గా మారింది. హైదరాబాద్కు చెందిన నూరాలజిస్ట్ సుధీర్ ట్విట్టర్లో ఈ పోస్టు చేశారు. కొన్ని నెలల క్రితం భార్యాభర్తలు ఆరేళ్ల వయసున్న బాలుడుతో తన దగ్గరికి వచ్చారని, బాలుడిని బయటే పెట్టి మొదట తనను కలిశారని, బాలుడికి క్యాన్సర్ ఉన్న విషయాన్ని ఆ చిన్నారితో చెప్పొద్దు అని ఆ తల్లిదండ్రులు డాక్టర్ని ప్రాధేయపడ్డారట. తర్వాత బాబుని లోపలికి తీసుకురాగా అన్ని మెడికల్ టెస్టులు చేసిన తర్వాత చిన్నారికి గ్లయోబ్లాస్టోమా మల్టీ ఫార్మీ అనే ఒక ప్రమాదకరమైన మెదడు క్యాన్సర్ నాలుగో దశలో ఉంది అని వైద్యుడు గుర్తించారట. తన చావు గురించి అమ్మానాన్నలకు చెప్పొద్దని ఆ బాబు అలా అనడం తో నా తో పాటు అబ్బాయి తల్లి తండ్రులు షాక్ కి గురయ్యామని…చివరి క్షణాల్లో ఆనందంగా ఉంచాలని వారికి సూచించానని… పోస్టులో తెలిపారు. చివరకు బాలుడు లోకాన్ని విడిచి పోయాడు. వైద్యుడు చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
6-yr old to me: “Doctor, I have grade 4 cancer and will live only for 6 more months, don’t tell my parents about this” 1. It was another busy OPD, when a young couple walked in. They had a request “Manu is waiting outside. He has cancer, but we haven’t disclosed that to him+
— Dr Sudhir Kumar MD DM🇮🇳 (@hyderabaddoctor) January 4, 2023

