మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
– అందజేసిన ఏఎంసీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మృతుని కుటుంభానికి తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్ సాయం అందజేశారు. తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన తుమ్మనపల్లి అనంతయ్య గురువారం రాత్రి మృతి చెందారు. శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న వడ్డె శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని అంత్యక్రియల కోసం రూ.3వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాకార సంఘం డైరెక్టర్ పెంచడా నర్సింలు, కోస్గి ఆశన్న, డప్పు రాజు, రామప్ప, నర్సింలు, అనంతయ్య, వెంకటేష్, డావిడ్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

