సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బుయ్యని బ్రదర్స్
– శ్రీనివాస్ కుమారుడి శుభలేఖ అందించి ఆహ్వానం
– సీఎంను కలిసిన తాండూరు నేతల సంతోషం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డిని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఆయన సోదరుడు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సోదరులు కలిశారు.

ఆదివారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈనెలలో జరిగే బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కుమారుడు బ్రిజేష్ రెడ్డి విహాహా శుభలేఖను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసి పెండ్లికి హాజరుకావాలని ఆహ్వానించారు.

అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, యూత్ కాంగ్రెస్ తాండూరు పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ కూడ సీఎం కలిసి సంతోషం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

