ఒకే వ్యక్తికి ఇద్దరితో పెండ్లి..!

జాతీయం తెలంగాణ హైదరాబాద్

ఒకే వ్యక్తికి ఇద్దరితో పెండ్లి..!
– మూహుర్తం కూడ ఒకటే
– వైరల్‌ అయిన వెడ్డింగ్ కార్డు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : అవును.. ఆయన ఇద్దరితో పెండ్లి చేసుకుంటున్నాడు. అది కూడా ఒకే ముహుర్తానికి. ఈ పెండ్లి శుభలేక సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మహిళ దినోత్సవం రోజే ఆయన ఇద్దరిని పెండ్లి చేసుకోవడం విశేషం. మరో విశేషమేమింటంటే ఏడాది కాపురం చేసిన తరువాత ఇద్దరికి తాళికట్టబోతున్నాడు. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన వ్యక్తి ఒకే ముహూర్తానికి ఇద్దరు వధువుల మెడలో తాళిబొట్టు కట్టనున్నాడు. కుర్నపల్లి గ్రామపంచాయతీకి చెందిన కోయ గిరిజనుడు, వ్యవసాయ కూలీ మడివి సత్తిబాబు అదే గ్రామానికి చెందిన సునీతతో పాటు దోశిళ్లపల్లికి చెందిన స్వప్నకుమారిని ప్రేమించాడు. ఈ క్రమంలో స్వప్నతో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించగా.. విషయం తెలుసుకున్న సునీత నిలదీసింది. ఇరువురికీ సర్దిచెప్పేందుకు పెద్దలు ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో సత్తిబాబు ఇద్దరితోనూ ఎర్రబోరులో ఏడాది క్రితం కాపురాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం సునీత, స్వప్నకు ఒక్కో సంతానం ఉన్నారు. కోయ గిరిజనుల్లో కొన్ని తెగల వారు కొంత కాలం కలిసి కాపురం చేశాక వివాహం చేసుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో వివాహ విషయాన్ని నలుగురికి తెలిసేలా విందు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు, పెద్దలు సూచించారు. దీంతో సత్తిబాబు గురువారం ఉదయం 7.04 గంటలకు ఇద్దరితో కల్యాణ ముహూర్తమని శుభలేఖలు అచ్చు వేయించి బంధువులకు పంచాడు. దీంతో ఈ కార్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది