స్పీడ్ క్యూబింగ్లో సత్తా..!

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

స్పీడ్ క్యూబింగ్లో సత్తా..!
– కాంస్య పథకం సాధించిన చైత్ర
– అభినందించిన స్కూల్ యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్పీడ్ క్యూబీంగ్ పోటీలో తాండూరు విద్యార్థిని సత్తా చాటింది. ఎస్ఎఫ్ఎ పోటీలో పాల్గొన్న చైత్ర అనే విద్యార్థిని కాంస్య పథకం సాధించి అదరగొట్టింది. వివరాల్లోకి వెళితే… తాండూరు పట్టణంకు చెందిన బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరీ రాజ్ కుమార్ కూతురు చైత్ర పట్టణంలోని శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అయితే హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడీయంలో ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో అండర్ 14 బాలికల విభాగంలో జరిగిన రూబీక్స్ క్యూబ్ పోటీలో చైత్ర పాల్గొంది. ఈ పోటీలో చైత్ర ప్రతిభను కనబరిచి మూడో స్థానంలో నిలిచింది. కేవలం 41 సెకన్లలో క్యూబీంగ్ పూర్తి చేసి కాంస్య పథకం సాధించి సత్తా చాటింది. దీంతో విద్యార్థిని చైత్రను స్కూల్ యజమాన్యంతో పాటు తల్లిదండ్రులు అభినందించారు.

ఇదికూడా చదవండి…

స‌గ్గు బియ్యం.. సగం బలం..!