పీఆర్జీటీఏ క్యాలెండర్ ఆవిష్కరణ
– ఆవిష్కరించిన టీఎస్ఆర్డీసీ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పీఆర్జీటీఏ శాఖ నూతన సంవత్సర క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర రవాణా కార్పోరేషన్(టీఎస్ఆర్డీసీ) చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ఆవిష్కరించారు. శనివారం హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి జిల్లా అధ్యక్షులు వి.రామకృష్ణారెడ్డి, గేటర్ హైదరాబాద్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు సంరెడ్డి భుజంగ రెడ్డిల సమక్షంలో 2025 పీఆర్జీటీఏ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘానికి తమవంతు తోడ్పాటు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ వికారాబాద్ అధ్యక్షులు ప్రకాష్, సంఘాల ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

