నాయకుడు సేవకుడు ఎంపీ రంజిత్ రెడ్డి
– శుభకాంక్షలు చెప్పిన అఫ్పూ(నయూం)
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి నాయకుడు, సేవకుడు అంటూ తాండూరు టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) అన్నారు. ఆదివారం ఎంపీ రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా హైదరాబాద్లో అఫ్పూ(నయూం) ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ రంజిత్ రెడ్డిని శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అఫ్పూ మాట్లాడుతూ ఎంపీ రంజిత్ రెడ్డి గొప్ప నాయకుడు, సేవకుడు అంటూ అభివర్ణించారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.


