మార్వాడి యువమంచ్ నూతన కార్యవర్గం ఎన్నిక

తాండూరు రాజకీయం వికారాబాద్

మార్వాడి యువమంచ్ నూతన కార్యవర్గం ఎన్నిక
– అధ్యక్షులుగా కిషన్ గోపాల్ రాఠి, కార్యదర్శిగా కరణ్‌ జైన్
– ఘనంగా ప్రమాణ స్వీకారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : మార్వాడి యువ మంచ్ తాండూరు శాఖ నూతన కార్యవర్గం ఎన్నికైంది. కార్యవర్గ పదవి ప్రమాణ స్వీకారం కూడా ఘనంగా జరిగింది.

గురువారం తాండూరు పట్టణం బాలాజీ మందిరంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. మంచ్ నూతన అధ్యక్షులుగా కిషన్ గోపాల్ రాఠీ, కార్యదర్శిగా కరణ్ జైన్, కోశాధికారిగా భరత్ దేవ్డా, ఉపాధ్యక్షులుగా రోహిత్ అగర్వాల్, అరుణ్ సార్డా, మధు సోనీ, జాయింట్ సెక్రటరీగా సునిల్ సార్డా, నిహార సోమాని, కిషన్ బూబ్, పీఆర్వోగా దినేష్ పర్థానిలు ప్రమాణ స్వీకారం చేశారు.

అదేవిధంగా కార్యవర్గ సభ్యులుగా నితిన్ సోమాని, అనిల్ సార్డా, బ్రిజ్ మోహన్ బూబ్, సన్నీ అగర్వాల్, లక్ష్మీనారాయణ బూబ్, ఆశిష్ సార్డా, రమాకాంత్ పండిట్, సంజయ్ సార్డా, నిఖిల్ గాగ్రాణి, రోహిత్ సోనీ, దీపక్ బూబ్, అభిషేక్ సార్డా, అభిలాష్ పండిట్ , గిరిధర్ పార్టీని, నితిన్ సార్డా, అభిషేక్ అగర్వాల్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ అధ్యక్షుడు రామనారాయణ బూబ్ సభ్యులకు పదవీ ప్రమాణం చేయించారు, ఈ కార్యక్రమంలో సమాజ అధ్యక్షులు మురళీధర్ గగ్రాణి, రాజస్థానీ నవ యువక సంఘ్‌ అధ్యక్షుడు మన్మోహన్ సార్డా, మహిళ మండలి అధ్యక్షురాలు కిరణ్ సార్డా, మంచ్ రాష్ట్ర కార్యదర్శి రోహిత్ అగర్వాల్, సమాజ పెద్దలు, మహిళ మండలి సభ్యులు, మంచ్ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వీరశైవ యువదళ్‌ కార్యవర్గం ఎన్నిక