మసూద్ కు ఎమ్మెల్యే పరామర్శ..!
– ఇంటికి వెళ్ళి పలకరించిన మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మసూద్ ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరామర్శించారు.

శనివారం ఎమ్మెల్యే ఆయన ఇంటికి వెళ్లి పలకరించారు. గత కొన్ని రోజులుగా మసూద్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మసూద్ ను పలకరించి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తననుపరమర్శించిన ఎమ్మెల్యేకు మసూద్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల్ల నర్సింలు, సీనియర్ నాయకులు అబ్ధుల్ రావుఫ్, తదితరులు ఉన్నారు.


