షిర్డీ సాయినాథున్ని సన్నిధిలో సీనియర్ జర్నలిస్ట్, వ్యాపారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మహారాష్ట్రలోని సాయినగర్ లో వెలసిన శ్రీ షిరిడి సాయినాథుని సన్నిధిలో తాండూరుకు చెందిన సీనీయర్ జర్నలిస్టు రాంచెందర్, పలువురు వ్యాపారులు తరించారు. ఆదివారం షిర్డీ పుణ్యక్షేత్రానికి చేరుకున్న వారు సాయి బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హారతి దర్శనం చేసుకొని, మొక్కులను తీర్చుకున్నారు. సాయిబాబాను దర్శించుకున్న వారిలో సీనియర్ జర్నలిస్ట్ పి.రాంచందర్(సూర్య), వ్యాపార వేత్తలు వై.రామలింగ రెడ్డి,ఏ.నాగేంద్ర ప్రసాద్ చౌదరి తదితరులు ఉన్నారు.



