రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
– ప్రకటించిన విద్యుత్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: రేపు తాండూరు నియోజకవర్గంలో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. శనివారం యాలాల మండలంతో పాటు ధారూర్ మండలాల్లోని రాఘాపూర్, బాగాయిపల్లి, నాగారం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ అంతరాయం ఉంటుందని డీఈ భానుకూమార్ వెల్లడించారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండబోదని స్పష్టం చేశారు. విద్యుత్ మరమ్మత్తులను దృష్టిలో ఉంచుకుని విధిస్తున్న అంతరాయంకు వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి…

