ఆషాడం గొరింటాకు సంబరం
– చేతులకు పెట్టుకున్న మహిళలు
– కౌన్సిలర్ సంగీత ఠాకూర్ ఇంట సందడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఆషాఢ గొరింటాకు సందడి ఏర్పడింది. శుక్రవారం మున్సిపల్ పరిధి గాంధీనగర్ వార్డు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ నివాసంలో సామూహిక గోరింటాకు సంబరం జరుపుకున్నారు. కౌన్సిలర్ తో పాటు మహిళలు చేతులకు గొరింటాకును వేసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో మహిళలు గొరింటాకు పెట్టుకొ వడం సంప్రదాయం అన్నారు. సంప్రదాయంతో పాటు గొరింటాకు వల్ల ఆరోగ్య రహస్యాలు ఉన్నాయన్నారు. గొరింటాకు వల్ల ఆందంతో పాటు చర్మ వ్యాధుల నుంచి రక్షణ పొందుతారని తెలిపారు.
ఇదికూడా చదవండి…

