ఆగ్మాన్లతో ఆగమాగం చేయొద్దు
– ఏమైనా జరిగిదే నిర్వహకులతో బాధ్యత
– నిర్వహకులకు పోలీసుల సూచన
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ఆగ్మాన్ పేరుతో పాటిస్తున్న కొత్త సంస్కృతిపై పోలీసులు నిర్వహకులకు కీలక సూచనలు చేశారు.

ఈ మేరకు మంగళవారం తాండూరు పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ ఓ ప్రకటన విడుదల చేశారు. పండగ సందర్భంగా వినాయకులను ప్రతిష్టించే నిర్వహకులు ఆగ్మాన్ పేరుతో చేస్తున్న ఊరేగింపులు చేస్తున్నారని.. ఎలాంటి పరిషన్లు లేకుండా నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

ఊరేగింపులకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వడం లేదని అన్నారు. ఆగ్మాన్ పేరుతో ఆగమాగం చేయరాదని, ఊరేగింపులో ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఏదైనా అవాంఛనీయమైన సంఘటన జరిగితే నిర్వాహకులకులదే బాధ్యత అని హెచ్చరించారు. పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని, వినాయక ఉత్సవ నిర్వహకులు పోలీసులకు సహకరించగలరని విజ్ఞప్తి చేశారు.


