మ‌స్తు మ‌స్తుగా మ‌గాళ్ల పెండ్లి

జాతీయం తెలంగాణ

స్తు మ‌స్తుగా మ‌గాళ్ల పెండ్లి
– తెలంగాణ‌లో గే ల తొలి వివాహం
– రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లో వేడుక‌
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: అమ్మాయితో అబ్బాయి పెండ్లి జ‌ర‌గ‌డం సాధార‌ణం. అదే అబ్బాయితో అబ్బాయికి పెండ్లి జ‌ర‌గ‌డం వింత‌. అయితే ఇలాంటి వింతలు విదేశాలలో జ‌రుగడం కామ‌న్. అలాంటి సంస్కృతి మన దేశంలో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతోంది. తాజాగా మ‌నదేశంలో ఇద్దరు పురుషులు ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అది మ‌న తెలుగు రాష్ట్రంలో జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలాంటివి జరిగిన దాఖలాలే లేవు. మొదటిసారిగా తెలంగాణలో ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకున్నారు. తెలంగాణాలో పెళ్లి చేసుకున్న మొదటి గే జంటగా రికార్డ్ సృష్టించారు. తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ వేధిక‌గా రాష్ట్రంలోని తొలి గే జంట పెండ్లి మ‌స్తు మ‌స్తుగా జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే… హైద‌రాబాద్‌కు చెందిన సుప్రియో ఇక్క‌డే.. హోటల్‌ మెనేజ్‌మెంట్‌ స్కూల్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా.. అభయ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన సుప్రియో, అభయ్ ల స్నేహం ప్రేమగా మారింది.

ఇంకాస్త ముందుకు వెళ్లి పెండ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇదే విషయాన్సి కొన్ని నెల‌ల క్రితం ఇంట్లో వాళ్ల‌కు తెలిపారు. ఇందుకు పెద్దవాళ్ల నుంచి అంగీకారం రావ‌డంతో పెండ్లికి సిద్ద‌మ‌య్యారు. ఆదివారం ఈ వివాహ వేడుక సంప్రదాయ బద్ధంగా మంగళస్నానాలు, సంగీత్‌ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. వికారాబాద్ హైవేలోని ట్రాన్స్ గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్‌లో శనివారం జరిగిన తెలంగాణ తొలి స్వలింగ సంపర్కుల వివాహ వేడుక కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభంగా జరిగింది. అందరి సమక్షంలో సుప్రియో, అభయ్ లు ఒక్కటయ్యారు. తెలంగాణలో ఇద్దరు స్వలింగ సంపర్కులు(గే) చేసుకుంటున్న తొలి వివాహం ఇదే.