ఆర్ఆర్ఆర్ లపై వేటు..!
– బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్
దర్శిని డెస్క్ : తెలంగాణ బడ్జెట్ సమావేశంలో తొలిరోజే ఆర్ఆర్ఆర్ లపై వేటు పడింది. తెలంగాణ శాసనసభ నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడుతున్న ఈటల రాజేందర్, రాజా సింగ్, రఘునందన్ రావును సస్పెండ్ చేశారు. సభ ముగిసే వరకు ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

