పోస్టాఫీసులో ఉద్యోగాలు..!

కెరీర్ జాతీయం టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

పోస్టాఫీసులో ఉద్యోగాలు..!
– పది పాసైతే చాలు
– రాతపరీక్ష లేకుండానే జాబ్
– మరింత సమాచారం తెలుసుకోండి
దర్శిని డెస్క్‌: తపాల శాఖలో కొలువుర జాతర ఏర్పడింది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున ఉద్యోగాలను ప్రకటించింది. పది పాసైతే చాలు.. రాతపరీక్ష లేకుండా జాబ్ పొందచ్చని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న.. 30,041 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌), బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇండియా పోస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1058 , తెలంగాణలో 961 వరకు ఖాళీలు ఉన్నాయి. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగం కేటాయిస్తారు. అంటే ఎటువంటి రాత పరీక్ష ఉండదన్నమాట. ఎంపికైతే పోస్టును బట్టి రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు జీతంగా చెల్లిస్తారు. రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే పని చేయవల్సి ఉంటుంది.

వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ అందిస్తారు. ఆ సేవలకు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌/ కంప్యూటర్‌/ స్మార్ట్‌ ఫోన్‌ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. ఐతే సంబంధిత పోస్టల్‌ శాఖ కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. అలాగే సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి. మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష సబ్జెక్టులతో పదో తరగతిపాసైతే చాలు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారైతే తెలుగు సబ్జెక్టుతో పది పాసై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అలాగే సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి సబ్జెక్టుల్లో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష తప్పనిసరిగా ఉండాలి. ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదివుండాలన్నమాట. అభ్యర్ధుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. పదో తరగతిలో వచ్చిన మార్కులు, స్థానికత, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఎస్‌ఎంఎస్‌/ఈమెయిల్‌/పోస్టు ద్వారా సమాచారం అందిస్తారు.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరితేదీగా ఆగస్టు 23, 2023ని నిర్ణయించారు. దరఖాస్తు చేసేటప్పుడు జనరల్ అభ్యర్థులు రూ.100 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఫీజు చెల్లింపు లేదు.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/gds-july2023-03-08-2023.pdf

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!