మల్లు సోదరులతో శీనన్న
– ప్రత్యేకంగా భేటీ అయిన నేత
– తాండూరు రాజకీయాలు, అభివృద్ధిపై చర్చ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవిలతో తాండూరు కాంగ్రెస్ నాయకులు, అర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం హైదరాబాద్ లోని వారి నివాసంలో శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీగా ఘన విజయం సాధించిన మల్లు రవికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తాండూరు నియోజక వర్గ అభివృద్ది, రాజకీయాలపై చర్చించారు.
ఇదికూడా చదవండి….

