రాఘవేంద్రుని సన్నిధిలో టీఆర్ఎస్ నేత
– మంత్రాలయంలో స్వామిని దర్శించుకున్న బంటు మల్లప్ప
తాండూరు, దర్శిని ప్రతినిధి: మంత్రాలయంలో వెలసిన శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో తాండూరు టీఆర్ఎస్ నేత బంటు మల్లప్ప గడిపారు. బుధవారం బంటు మల్లప్ప తన మిత్ర బృందంతో కలిసి మంత్రాలయం వెళ్లారు. ఉదయం వేళ స్వామి వారిని భక్తిశ్రద్దలతో దర్శించుకున్నారు. అనంతరం తాండూరు ప్రజలను సల్లంగా చూడాలని రాఘవేంద్ర స్వామిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.



