ఎల్లుండి తాండూరులో నిరసన ర్యాలీ
– పిలుపునిచ్చిన హిందూ ధర్మ పరిరక్షణ సమితి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో ఎల్లుండి నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు హిందూ ధర్మ పరిరక్షణ సమితి తెలిపింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బుధవారం నిరసన ర్యాలీకి పిలుపునిచ్చినట్లు స్పష్టం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 10గంటల నుంచి తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయించడం జరిగిందని వెల్లడించింది. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యాపారస్తులు, హిందువులు, యువకులు, హిందూ బందువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి…

