బంటు మల్లప్పకు ఘన సన్మానం

తాండూరు రాజకీయం వికారాబాద్

బంటు మల్లప్పకు ఘన సన్మానం
– శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– కట్ చేయించిన ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నాయకులు బంటు మల్లప్పను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డిలు వేరు వేరుగా సన్మానించారు. బంటు మల్లప్ప జన్మదినం సందర్బంగా మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బంటు మల్లప్పను సన్మానించి శుభాకంక్షలు తెలిపారు. అదేవిధంగా ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి వారి నివాసంలో బంటు మల్లప్ప చేత కేక్ కట్ చేయించి శుభాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, సీనీయర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, జిల్లా గ్రంథలా సంస్థ మాజీ చైర్మన్ మురళీగౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, సయ్యద్ జుబేర్ లాల, యూత్ కాంగ్రెస్ నాయకులు కావలి సంతోష్‌ కుమార్, బంటు వేణుగోపాల్, యువ నాయకులు వికాష్ జోషి, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పరిశుభ్రదతో ఆరోగ్యవంతమైన సమాజం