మృతుని కుటుంబానికి దివిటి ఎల్లప్ప పరామర్శ
– అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో మృతుని కుటుంబానికి స్థానిక యువనాయకులు దివిటి ఎల్లప్ప పరామర్శించారు. పాత తాండూరు వార్డు నెంబర్ 15లో ముంగిమళ్ల అశోక్ అనే యువకుడు మరణించారు.

సోమవారం ఈ విషయం తెలుసుకున్న దివిటి ఎల్లప్ప కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. మృతి చెందిన యువకుడి అంత్యక్రియల కోసం తన వంతుగా ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. ఇందుకు కుటుంబ సభ్యులు ఎల్లప్పకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జై నరేష్, సాయిప్రసాద్, నీరటీ గోపాల్, శివకుమార్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

