సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు భరోసా

తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు భరోసా
– కాంగ్రెస్ యువ నాయకులు బిడ్కర్ రఘు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎంఆర్ఎఫ్ పథకం పేదల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తోందని తాండూరు కాంగ్రెస్ యువనాయకులు బిడ్కర్ రఘు అన్నారు.

పట్టణంలోని 20వ వార్డుకు చెందిన సుజాత అనే మహిళ అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యింది. సీఎంఆర్ఎఫ్ పథకానికి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఆమెకు రూ.60వేలు మంజూరు చేసింది. బుధవారం బిడ్కర్ రఘు సుజాతకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీని అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం భరోసాగా నిలుస్తోందని అన్నారు. ఈ పథకాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రవి, ఆరీఫ్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి