మాజీ ఎంపీ డా. రంజిత్ రెడ్డికి బీఎస్ఆర్ పరామర్శ
– నివాసానికి వెళ్ళి పలకరించిన శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: చేవెళ్ల మాజీ ఎంపీ డా. రంజిత్ రెడ్డిని తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.

ఇటీవల కాంగ్రెస్ పార్టీ రంజిత్ రెడ్డి మాతృమూర్తి మరణించిన విషయం తెలిసిందే. ఆదివారం బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఆత్మీయంగా కలుసుకుని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రావుఫ్, మసూద్ తదితరులు ఉన్నారు.



