భక్తిశ్రద్ధలతో వినాయక పూజ
– పసారి వార్డులో చవితి శోభ
– వైభవంగా గణేషుని ప్రతిష్ట
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలోని పసారి వార్డులో శ్రీ వినాయక పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. తాండూరు గోశాల జాయింట్ సెక్రెటరీ సిరిట్పేట్ రమేష్కుమార్ దంపతులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేద పండితులు శ్రీకర్ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తి శ్రద్ధలతో గణేషుని ప్రతిష్ట చేసి.. ఉండ్రాళ్ళు, పిండి వంటలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక మహిళలు, యువకులు, భక్తులు, ప్రముఖులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో పసారి వార్డు ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది.


