కొత్త జంటను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: కొత్తగా పెళ్లి చేసుకున్న వధూ వరులను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆశీర్వదించారు. పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామానికి చెందిన వడ్ల సంఘమేశ్వర్ వివాహ బందంతో ఒక్కటయ్యారు. ఆదివారం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వారి నివాసానికి చేరుకున్నారు. నూతన వధూ వరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ వెంట పెద్దేముల్ పీఏసీఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్దన్ రెడ్డి, సీనీయర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

