రైతులకు గుడ్న్యూస్..
– రూ.18 లక్షలు అందించనున్న కేంద్రం
– ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
దర్శిని ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతుల అభ్యున్నతి కోసం రూ. 18 లక్షల ఆర్ధిక సహాయం అందజేస్తున్నట్లు ప్రకటించింది.
: రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుతమైన వార్త వచ్చింది. ఈ మేరకు రూ.18 లక్షలు రైతులకు అందనున్నాయి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది.. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం ‘పీఎం కిసాన్ ఎఫ్పీఓ యోజన’ పథకాన్ని ప్రారంభించింది. PM కిసాన్ FPO పథకం కింద, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించడానికి రైతులకు రూ.18 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే, దీని కోసం రైతులు కనీసం 11 మంది రైతులను కలిగి ఉన్నటువంటి సంస్థలో చేరాలి.
దీనితో పాటు ఎరువులు, విత్తనాలు, రసాయనాలు, వ్యవసాయ యంత్రాలు వంటి నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రైతులకు సహాయం చేస్తుంది. ఈ పథకం కింద రైతు ఉత్పత్తిదారుల సంస్థకు రూ.18 లక్షలు అందజేస్తారు. కొత్త వ్యవసాయ వ్యాపారాన్ని ప్రారంభించడానికి దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అందించనుంది. దీంతో రైతులకు వ్యవసాయ పరికరాలు లేదా ఎరువులు, విత్తనాలు లేదా మందులు కొనుగోలు చేయడం కూడా సులభతరం కానుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు..
1. ముందుగా నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్సైట్కి వెళ్లాలి.
2. హోమ్ పేజీలో FPO ఆప్షన్పై క్లిక్ చేయాలి.
3. ఇక్కడ ‘రిజిస్ట్రేషన్’ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అప్పుడు ఫారం ఓపెన్ అవుతుంది.
4. ఫారమ్లో కోరిన మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి.
5. ఆ తర్వాత పాస్బుక్ లేదా క్యాన్సిల్ చెక్ లేదా IDని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
6. చివరగా సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

