జుబేర్లాలను పరామర్శించిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు జుబేర్ లాలను ఆ పార్టీ నాయకులను పరామర్శించారు. గత కొన్ని రోజుల క్రితం జుబేర్ లాల అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల హైదరాబాద్లో చికిత్స పొంది తిరిగిన వచ్చిన సందర్భంగా విషయం తెలుసుకున్న నాయకులు జుబేర్ లాల నివాసానికి వెళ్లారు. టీఆర్ఎస్ తాండూరు పట్టణ నూతన అధ్యక్షులు అఫ్పూ(నయూం), సీనీయర్ నాయకులు రాజుగౌడ్, కౌన్సిలర్ ముక్తార్ నాజ్, దర్మీదీ నాగేష్లు జుబేర్ లాలను పరామర్శించి.. ఆరోగ్యంగా కోలుకోవడంపై శాలువా, పూలమాలతో సన్మానించారు.
