అవ్వను కొట్టిన కండక్టర్..!
– కర్ణాటకలో బస్సులో సంఘటన
– ఉచిత ప్రయాణ పథకంపై మండిపాటు
దర్శిని డెస్క్: ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాల్సిన మహిళ కండక్టర్ ఓ అవ్వ చెంపను చెల్లుమణిపించింది. ఈ సంఘటన కర్ణాటక కేఎస్ఆర్టీసీలో వివాదాస్పాదమైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన ‘శక్తి పథకం’ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నప్పటికీ.. కొన్ని చోట్ల మహిళల పట్ల రవాణా శాఖ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఓ మహిళా ప్రయాణికురాలిపై కర్ణాటక ఆర్టీసీ బస్ కండక్టర్ చేయి చేసుకోవడం చర్చణీయంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. కుండల్ నుంచి హుబ్లీకి వెళ్లున్న కర్ణాటక ఆర్జీసీ బస్సులో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గత శుక్రవారం (జూన్ 23) కర్ణాటకలోని హుబ్బళి బస్సులో ఓ వృద్ధ మహిళను మహిళా కండక్టర్ చెంపదెబ్బ కొట్టింది. మిగతా ప్రయాణికులు ప్రశ్నించగా సదరు కండక్టర్ వారిని కూడా కన్నడలో తిట్టడం ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. వృద్ధురాలిని చెంపదెబ్బ కొట్టిన కండక్టర్కు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ಹುಬ್ಬಳ್ಳಿ| ಅಜ್ಜಿ ಮೇಲೆ ಹಲ್ಲೆ ಮಾಡಿದ ಲೇಡಿ ಕಂಡಕ್ಟರ್ !!#News18Kannada #FreeBusTravel #shaktischeme #CongressGuarantee @BJP4Karnataka @RLR_BTM pic.twitter.com/ld521kHs29
— News18 Kannada (@News18Kannada) June 23, 2023
ఇదికూడా చదవండి…


