పోస్టాఫీసులో బంపర్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకం
– 115 నెలల్లోనే డిపాజిట్ డబ్బులు డబుల్
– ప్రయోజనం అందించే పథకం గురించి తెలుసుకోండి
దర్శిని డెస్క్: పేదలు, మద్యతరగతి ప్రజలు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలలో పెట్టుబడులు పెడుతుంటారు. బ్యాంకులతో పాటు తపాలా శాఖలో పలు రకాల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు ఉన్నాయి. కాని ఇందులో రెట్టింపు డబ్బులు అందించే పథకాల గురించి అందరికి తెలియవు. అలాంటి ఒక పథకం కిసాన్ వికాస్ పత్ర. ఈ పోస్టాఫీసు పథకం మునుపటి కంటే మరింత ప్రయోజనకరంగా మారింది, ఎందుకంటే 120 నెలలకు బదులుగా, పెట్టుబడి పెట్టిన మొత్తం 115 నెలల్లోనే రెట్టింపు అవుతుంది. మీరు ఈ రోజుల్లో ఫిక్స్డ్ డిపాజిట్కు కిసాన్ వికాస్ పాత్రను సువర్ణ అవకాశంగా ఎంచుకోవచ్చు. కిసాన్ వికాస్ పత్ర ఒక చిన్న పొదుపు పథకం. ప్రతి మూడు నెలలకు, ప్రభుత్వం దాని వడ్డీ రేటును సమీక్షిస్తుంది. అవసరాన్ని బట్టి మార్పులు చేస్తుంది. ఇందులో ఖాతా తెరవడం ఎలా, వడ్డీ సదుపాయాలను ఎలా అందుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
ఖాతా ఎలా తెరవాలంటే.. ?
ఈ పథకం కోసం ఖాతాను తెరవడం చాలా సులభం. పోస్టాఫీసులో ఇందుకోసం డిపాజిట్ రసీదుతో పాటు దరఖాస్తును నింపిండి. అయితే, పెద్దలు వారి తరపున ఖాతాను తెరవండి. పెట్టుబడి మొత్తాన్ని నగదు రూపంలో రాయండి. చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్లో పోస్టాఫీసులో చెల్లుబాటు అయ్యేలా అందించండి. మీరు దరఖాస్తుతో పాటు మీ గుర్తింపు కార్డును కూడా జతచేయండి. అయితే మైనర్కు 10 సంవత్సరాల వయస్సు వచ్చిన వెంటనే వారి పేరు మీద ఖాతా బదిలీ చేయబడుతుంది. పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు కూడా ఖాతా తెరవడానికి అవకాశం ఉంది. దీనితో పాటు, కిసాన్ వికాస్ పత్రలో నామినీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
ఎంత వడ్డీ వస్తోంది
మీరు ఈ పథకంలో రూ. 1000 నుండి పెట్టుబడిని ప్రారంభించవచ్చు. దీని తర్వాత, రూ.100 గుణిజాలలో పెట్టుబడి పెట్టవచ్చు. కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై ప్రభుత్వం 7.5 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు. మీరు ఉమ్మడి ఖాతాను తెరవడం ద్వారా కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.
ఎలా రెట్టింపు అవుతుందంటే..?
ఈ పథకంలో పెట్టుబడి పెట్టబడిన మొత్తంపై వడ్డీని సమ్మేళనం ఆధారంగా లెక్కించబడుతుంది. కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడి మొత్తం 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. జనవరి 2023లో, ప్రభుత్వం కిసాన్ వికాస్ పత్ర మెచ్యూరిటీ వ్యవధిని 123 నెలల నుంచి 120 నెలలకు తగ్గించింది. ఇప్పుడు దాన్ని 115 నెలలకు తగ్గించారు. పోస్టాఫీసు వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీని సమ్మేళనం ఆధారంగా లెక్కించబడుతుంది.
ఇది కూడా చదవండి…

