సిద్ధకోటేంద్ర శివాచార్యను కలిసిన ఎమ్మెల్యే పైలెట్

తాండూరు రాజకీయం వికారాబాద్

సిద్ధకోటేంద్ర శివాచార్యను కలిసిన ఎమ్మెల్యే పైలెట్
– ఎమ్మెల్యేను ఆశీర్వదించిన శివాచార్య స్వామి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటక రాష్ట్రం నాల్వార్ క్షేత్ర గురువు సిద్దకోటేంద్ర శివాచార్య స్వామిని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కలిశారు. సోమవారం నాల్వార్ లో శివాచార్య స్వామి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొని శివాచార్య స్వామిని కలిశారు. ఈ సందర్భంగా శివాచార్య స్వామి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఎన్నికల్లో గెలవాలని ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శివాచార్య ఆశీర్వాదం పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత