రామ రాజ్యమే రావాలి
– శ్రీరాముడు ఆదర్శ ప్రాయుడు
– మాజీ ఎంపీ సతీమణి కొండా సంగీతారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో రామ రాజ్యమే రావాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి కొండా సంగీతారెడ్డి ఆకాంక్షించారు. బుధవారం తాండూరు పట్టణంలోని మారికాంబ కాలనీ, సీసీఐ కాలనీల్లో నిర్వహించిన శ్రీరాను నవమి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. సీతారాములను దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశంలో ప్రధాని మోడీ నాయకత్వంలో ధర్మపాలన కొనసాగుతుందన్నారు. రామ మందిరాన్ని స్థాపించి మళ్లీ రామ రాజ్యానికి మార్గం చూపారన్నారు. చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో కూడా రామ రాజ్యం రావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా శ్రీరాము అందరికి ఆదర్శప్రాయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

