డా.జయప్రసాద్ను పరామర్శించిన బీఎస్ఆర్
– తండ్రి భౌతిక ఖాయానికి నివాళులు
– సానుభూతి తెలిపిన శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన డా.జయప్రసాద్ను కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. జయప్రసాద్ తండ్రి పరంధాములు కన్నుమూసిన విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి శనివారం ఆయన నివాసానికి చేరుకున్నారు. పరంధాములు భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం డా.జయప్రసాద్ను శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. కుటుంభ సభ్యులకు సానుభూతిని తెలిపారు. పరంధాములు మరణం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, నాయకులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

