మున్సిపల్ బరిలో బిడ్కర్ జ్యోతి రఘు
– 20వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ బరిలో బిర్కడ్ కుటుంబం నుంచి జ్యోతి రఘు నిలుస్తున్నారు. బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో 20వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ యువనాయకులు బిర్కడ్ రఘు సతీమణి బిర్కడ్ జ్యోతి ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీ చేయబోతున్నారు. నామినేషన్ అనంతరం బిర్కడ్ రఘు, జ్యోతిలు మాట్లాడుతూ పట్టణంలోని 20వ వార్డులో కౌన్సిలర్ గెలువ బోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు అండగా ఉంటూ సేవలందించడమే ధ్యేయని అన్నారు.

ఇదికూడా చదవండి…

