కోడంగల్ మున్సిపల్ చైర్మన్ ను కలిసిన నేతలు
– శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కోడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ ను తాండూరు కాంగ్రెస్ నేతలు కలిశారు.

గురువారం తాండూరు భద్రేశ్వర దేవాలయ రేనవేషన్ కమిటీ మాజీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ నందారం ప్రశాంత్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

కోడంగల్ మున్సిపల్ అభివృద్ధి కోసం చైర్మన్ నందారం ప్రశాంత్ చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాండూరు యువనాకులు తాండ్ర రాకేష్, వినోద్ తదితరులు ఉన్నారు.


