సాయినాథ్ మ‌నోధైర్యం కోల్పోవ‌ద్దు

ఆరోగ్యం తాండూరు తెలంగాణ వికారాబాద్

సాయినాథ్ మ‌నోధైర్యం కోల్పోవ‌ద్దు
– ఉపాధ్యాయుడిని ప‌రామ‌ర్శించిన శుభ‌ప్ర‌ద్ ప‌టేల్
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: విధి ఎంత ఇబ్బందులు తెచ్చిన మ‌నోధైర్యంగా ఉండాల‌ని తెలంగాణ రాష్ట్ర బీసీ క‌మీషన్ మెంబ‌ర్ శుభ‌ప్ర‌ద్ ప‌టేల్ ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడుతో అన్నారు. తాండూరు ప్రాంత నివాసి, ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు సాయినాథ్ ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో రైలు ప్ర‌మాదంలో రెండు కాళ్లు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ప్ర‌మాదంలో గాయ‌ప‌డి హైద‌రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీసీ క‌మీష‌న్ మెంబ‌ర్ శుభ‌ప్ర‌ద్ ప‌టేల్ సోమ‌వారం గాంధీ ఆసుప‌త్రికి చేరుకున్నారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న సాయినాథ్‌ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదైర్య పడవద్దని అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. అనంతరం సాయి నాథ్ అందిస్తున్న చికిత్స వివరాలను వైద్యులకు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.