పేదల గుండెల్లో చిరస్మరణీడు వైఎస్ఆర్
– నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేద గుండెల్లో స్వర్గీయ వైఎస్. రాజశేఖర్ రెడ్డి చిరస్మరణీయుడుగా నిలిచిపోతారని తాండూరు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం తాండూరులో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టిన అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమానికి.. అభ్యున్నతికి అహర్నిషలు కృషి చేసిన మహనీయుడుగా వైఎస్ఆర్ను అభివర్ణించారు. ఆయన చేసిన కృషికి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుగా మిలిగిఉంటారని పేర్కొన్నారు. అదేవి ధంగా వైఎస్ఆర్ ఆశయసాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనీయర్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



