15న తాండూరుకు కేటీఆర్ రాక
– హాజరు కానున్న పైలెట్, కాసాని
– ప్రకటించిన బీఆర్ఎస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 15న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వికారాబాద్ జిల్లా తాండూరుకు వస్తున్నారు. ఈ విషయాన్ని తాండూరు బీఆర్ఎస్ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. కేటీఆర్తో పాటు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ కూడా వస్తన్నారు. ఈనెల 15న తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి కేటీఆర్ హాజరువుతున్నట్లు చెప్పారు. కావున పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి…

