చెక్కుల పంపిణీ వాయిదా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrచెక్కుల పంపిణీ వాయిదా..!
– ప్రకటించిన అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో పంపిణీ చేయాల్సిన కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ చెక్కుల పంపిణీ వాయిదా పడింది. ఈ విషయాన్ని శుక్రవారం అధికారులో ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు మండలానికి సంబంధించి మండల పరిషత్‌ కార్యాలయంలో కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ చెక్కుల పంపిణీ జరగాల్సి ఉంది. మొత్తం 196 మంది చెక్కులను అందించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వద్ద కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. లబ్దిదారులు కార్యక్రమానికి రావద్దని సూచించారు.

ఇదికూడ చదవండి…

రైల్వే ఫ్లైఓవర్‌ బాధితులకు పరిహారం