ప్రజావాణి కార్యక్రమం రద్దు
– ప్రకటించిన జిల్లా కలెక్టర్
– రద్దుకు కారణం ఏమింటంటే..?
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రకటించారు. ప్రతి సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తమ సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అయితే సోమవారం జిల్లా వ్యాప్తంగా గ్రూపు-3 పరీక్షలు జరగుతున్న నేపథ్యంలో రేపు సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రజావాణి కార్యక్రమానికి రావద్దని సూచించారు. తదుపరి నిర్వహించే ప్రజావాణిపై క్లారిటీ ఇవ్వడం జరగుతుందని తెలిపారు.
ఇదికూడా చదవండి…

