ఫ్రీగా రూ. 2లక్షల బీమా..!

ఆరోగ్యం జాతీయం టెక్నాలజీ తెలంగాణ వికారాబాద్ హైదరాబాద్


ఫ్రీగా రూ. 2లక్షల బీమా..!

– ప్రతినెలా రూ. 3వేల ఫించన్‌
– కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా అవకాశం
– అసంఘటిత కార్మికులే అర్హులు
– ఎలా దరఖాస్తు చేసుకోవాంటే..?
దర్శిని డెస్క్ : శ్రమ జీవులకు కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా రూ. 2లక్షల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. చాలా మంది కార్మికులు ఈ పథకంపై పూర్తి అవగాహన లేకపోవడంతో ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. శ్రమ జీవుల భవిష్యత్తు భద్రత కోసం, వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇ-శ్రమ్ కార్డు పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఆటో డ్రైవర్లు, డ్రైవర్లు, పంక్చర్ రిపేర్లు, గొర్రెల కాపరులు, పాల యజమానులు, పశువుల పెంపకందారులు, పేపర్ హాకర్లు, జొమాటో, స్విగ్గీ, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటి డెలివరీ బాయ్‌లు ఇ-శ్రామ్ కార్డులు పొందవచ్చు. అర్హులైన కార్మికులు గిగ్ కార్మికులు e-Shram పోర్టల్ https://eshram.gov.in/ ని సందర్శించడం ద్వారా తమను తాము నమోదు చేసుకోవచ్చు.
kvcs
రిజిస్ట్రేషన్ తర్వాత వారికి కార్డు కూడా అందిస్తారు. ఈ కార్డు కలిగి ఉంటేనే ప్రయోజనాలు పొందవచ్చు. 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెల రూ.3 వేలు పింఛను లభించే ఒక అద్భుతమైన పథకం ఇది. ఈ-శ్రమ్ లో నమోదు చేసుకోవాలనుకునే వారి వయస్సు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే వారు అసంఘటిత రంగానికి చెందినవారై ఉండాలి, అనగా పీఎఫ్, ESIC ప్రయోజనాలని పొందేవారు అయ్యి ఉండకూడదు.

దరఖాస్తు చేసుకోవడం ఇలా
e-Shram పోర్టల్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం మీరు ముందుగా eshram.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అప్పుడు మీరు “eShram లో రిజిస్టర్ చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. దీని తర్వాత మీరు EPFO ​​లేదా ESIC సభ్యుడా అనే ప్రశ్న అడుగుతారు, దానికి సమాధానం ఇవ్వండి. ఇప్పుడు “Send OTP” పై క్లిక్ చేసి మీ మొబైల్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి. తరువాత మీ 14 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి నిబంధనలు, షరతులపై టిక్ చేయండి. ఇప్పుడు “సమర్పించు” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఒక కొత్త ఫారమ్ తెరవబడుతుంది. అందులో మీ పుట్టిన తేదీ, చిరునామా, విద్య మరియు బ్యాంక్ వివరాలను పూరించండి. అన్ని సమాచారాన్ని జాగ్రత్తగా తనిఖీ చేసి, సమ్మతి అనే ఆప్షన్‌పై టిక్ చేసి మళ్ళీ సమర్పించండి. ఈ విధంగా మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీరు దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటవుట్ కూడా తీసుకోవచ్చు.

ప్రయోజనాలు ఇవే
ఈ కార్డు తీసుకున్న కార్మికులు దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురై పాక్షిక వికలాంగులుగా మారితే కేంద్ర ప్రభుత్వం రూ.1 లక్ష చెల్లిస్తుంది.
అదే శాశ్వత వైకల్యం లేదా మరణం సంభవించినప్పుడు రూ. 2 లక్షలు బీమా కవరేజీ బాధిత కుటుంబానికి లభిస్తుంది.
ఇందులో మీరు పూర్తిగా ఆయుష్మాన్ యోజన లో ఉచితంగా వైద్య సదుపాయాలు కూడా పొందుతారు.
ఇ-శ్రమ్ కార్డు ద్వారా కేవలం ఇన్సూరెన్స్ మాత్రమే కాకుండా వారి పిల్లలకు ఉచిత సైకిళ్లు, పని ముట్లు, కుట్టు మిషన్లు వంటి ఇతర ఆర్థిక సహాయాలు అందుకునే అవకాశం ఉంది.
అర్హత కలిగిన కార్మికులు పీఎం ఆవాస్ యోజన పథకం కింద పక్కా ఇళ్ల నిర్మాణానికి రూ. 1.2 లక్షలు పొందవచ్చు.

ఇదికూడా చదవండి…

ఆ దమ్మెవరికి లేదు..!