ఆ దమ్మెవరికి లేదు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆ దమ్మెవరికి లేదు..!
– అభివృద్ధిని ఆపే సాహసం చేయలేరు
– యూరియా ఇబ్బందులపై రాద్ధాంతం
– కొరతకు బీజేపీ నిర్ణయమే కారణం..?
– సంచలన వాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అభివృద్ధిని ఆపే దమ్మెవరికి లేదని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి వాఖ్యలు చేశారు. తనకు సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదలు ఉన్నాయని. ఉత్తిత్తి ఎమ్మెల్యేను కాను.. శిలాఫలకాలు, టెంకాయలు కొట్టే ఎమ్మెల్యేను అంతకన్నా కాను అని ఘాటుగా స్పందించారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు.
kvcs
తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని అన్నారు. త్వరలోనే బైపాస్ రోడ్డు పనులు పూర్తి చేస్తామని అన్నారు. పట్టణంలో రూ.54 కోట్లతో కొత్త పైపులైన్, రూ.50 కోట్లతో చిలుకవాగు అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు దశల వారిగా పనులు పూర్తి చేస్తామని అన్నారు. తాండూరులో అభివృద్ధిని ఆపేందుకు గతంలో కొందరు కుప్పిగంతులు వేశారని, ఆ వేషాలన్నీ ఇప్పుడు ఔడేటేడ్ అయ్యాని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు తనకు ఉన్నాయని, ఇప్పుడు అభివృద్ధి పనులు ఆపే దమ్ము ఎవ్వరికి లేదని, సాహసాలు ఎవ్వరు చేయరని అన్నారు. ఒకవేళ చేసిన రెండు నిమిషాల సంతోషమే అని ఎద్దేవా చేశారు. తాండూరులో త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా చూస్తామన్నారు.

పాత తాండూరులో రైల్వే అండర్ బ్రిడ్జిని పూర్తి చేస్తామని, పట్టణంలో దశల వారిగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టి పూరి చేయిస్తామన్నారు. తాను ఉత్తిత్తి ఎమ్మెల్యేను కానని, శిలాఫలాకాలు వేసి… టెంకాయలు కొట్టే ఎమ్మెల్యేను కానని అన్నారు. అదేవిధంగా యూరియా కొరత విషయంలో కొందరు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. గత యేడాది సీజన్ లో పంపిణీ చేసిన ఎరువులకంటే అధికంగా ఈ యేడాది యూరియా పంపిణీ చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. గత మే నుంచి అధిక వర్షాలు పడడంతో రైతులు ముందస్తుగా కొనుగోలు చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన కోటా ఇవ్వలేదని ఆరోపించారు. ఇందులో బీజేపీ తప్పిదమే ఉందని అన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లుతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళుతుందని, ఈ బిల్లు కేంద్రం చేతిలో ఉందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో చరిత్ర సృష్టించే విధంగా గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటీ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

భద్రేశ్వర షాపింగ్ కాంప్లెక్స్ అభివృద్ధికి తోడ్పాటు..!