ఎల్లుండి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
– సీఎం కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం తేది ఖరారైంది. ఈ నెల 11వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు. కేబినెట్ సమావేశంలో రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణతో పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు.



