మున్సిపల్ చైర్పర్సన్కు పితృవియోగం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్కు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి ఎం. బాలయ్య నారాయణఖేడ్ మండలం నిజాంపేట్లో నివాసముంటున్నారు. బుధవారం ఉదయం 10గంటలకు ఆయన వారి స్వగ్రామం నిజాంపేట్లో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కుటుంబ సభ్యులతో కలిసి నిజాంపేట్కు బయల్దేరారు.

