అన్నదాన సేవకు శాశ్విత స్థలం కేటాయించండి
– శ్రీశైలం దేవాస్థాన ఈఓకు వినతి
– స్వయంగా కోరిన బాపనోళ్ల శంకర్ యాదవ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీశైల పుణ్య క్షేత్రంలో తాండూరుకు చెందిన శ్రీ సాయిపుత్ర సంస్థ సేవా కార్యక్రమాలకు స్థలం కేటాయించాలని ఆ దేవాలయ ఈఓను ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త బావనోళ్ల శంకర్ యాదవ్ కోరారు. శనివారం దేవాలయ ఈఓను స్వయంగా కలిసి వినతిపత్రం అందజేశారు. గత 8 ఏండ్లుగా శ్రీ సాయిపుత్ర సేవా సంస్కృ శ్రీశైల క్షేత్రంలో అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. అన్నదాన సేవా కార్యక్రమానికి కాశ్విత స్థలం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నారని అన్నారు. కావున శ్రీ సాయిపుత్ర సేవా సంస్థకు శాశ్విత స్థలం కేటాయించేలా చొరవ చూపాలని ఈటను బావనోళ్ల శంకర్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఈఓ సానుకూలంగా స్పందించినట్లు సాయిపుత్ర సేవా సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్ యాదవ్ కుటుంబ సభ్యులు, మిత్రుడు కళ్యాణం చందు తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి…


