వెండి ధరలు పైపైకీ..

జాతీయం

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు పైపైకీ ఎగబాకుతున్నాయి.0 వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి ప్రియులు వాటి ధరల వైపు దృష్టిసారిస్తుంటారు. కరోనా కాలంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం కూడా వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండిపై రూ.700 మేర పెరిగింది. దేశంలో ఆదివారం కిలో వెండి రూ.63,200 లుగా ఉంది. ఈ రోజు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 63,200 లుగా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ ధర రూ. 63,200 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 68,200 లుగా ఉంది.
* బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ. 63,200 గా కొనసాగుతోంది.
* కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.63,200లుగా కొనసాగుతోంది